90 అడుగుల వాసవీ మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొననున్న పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయాన్ని సందర్శించనున్నారు. రేపు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వెళ్లి అక్కడ శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వాసవి ధామ్లో రేపు 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటకు విజయవాడ నుంచి హెలికాఫ్టర్లో పెనుగొండ వెళ్లి.. అక్కడి మార్కెట్ యార్డ్ నుంచి రోడ్డు మార్గంలో వాసవి ధామ్ ఆలయానికి చేరుకుంటారు.