అఖిలపక్ష సమావేశంపై ఉండవల్లి లేఖపై స్పందించిన చంద్రబాబు

  • విజయవాడలో రేపు ఉండవల్లి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
  • సమావేశానికి హాజరవుతామని చెప్పిన చంద్రబాబు
  • టీడీపీతో కలిసి ఒకే వేదికను పంచుకోలేమన్న వైసీపీ
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో రేపు విజయవాడలోని ఐలాపురం హోటల్ లో అఖిలపక్షం, మేధావుల సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ ఇప్పటికే అన్ని పార్టీలకు ఉండవల్లి లేఖలు రాశారు.

ఈ లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లి నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ భేటీకి ఎంపీ సీఎం రమేష్, మంత్రి నక్కా ఆనందబాబులు హాజరవుతారని చెప్పారు.

మరోవైపు, ఈ భేటీకి హాజరుకాలేమని వైసీపీ ప్రకటించింది. టీడీపీతో కలసి ఒకే వేదికను పంచుకోలేమని తమకు వైసీపీ నాయకత్వం తెలిపిందని ఉండవల్లి చెప్పారు. మిగిలిన పార్టీలన్నీ హాజరుకానున్నాయని తెలిపారు.
Go Back to Shorts
undavalli
chandrababu
all party
meeting
Vijayawada
Telugudesam
ysrcp

More Telugu News