మమత అక్కయ్య.. నా ఫుల్ సపోర్ట్ నీకే!: రాహుల్ గాంధీ ప్రకటన
- రేపు కోల్ కతాలో విపక్షాల ర్యాలీ
- మోదీ బూటకపు హామీలు ఇచ్చారన్న రాహుల్
- అందువల్లే విపక్షాలు ఏకమవుతున్నాయని వ్యాఖ్య
మహిళలు, చిన్నారులు, కులం, మతం, భాష అన్న తేడా లేకుండా అందరి మాటకు గౌరవం ఇచ్చే రేపటి భారతం కోసం విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని రాహుల్ పునరుద్ఘాటించారు. హక్కులు, భావజాలాల పరిరక్షణలో బెంగాలీలు ఎప్పుడూ ముందుంటారని రాహుల్ ప్రశంసించారు. ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావడం ద్వారా బలమైన సందేశాన్ని పంపినట్లు అవుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మమతకు రాసిన లేఖను రాహుల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
.