15 రోజుల క్రితం ప్రేమ వివాహం... నవ వధువు కిడ్నాప్!

  • వనస్థలిపురంలో ఘటన
  • పెళ్లికి అంగీకరించని పెద్దలు
  • వరుడి ఇంటిపై దాడి, ఆపై కిడ్నాప్
రెండు వారాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్ కావడం హైదరాబాద్ నగర శివార్లలోని వనస్థలిపురంలో తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ ప్రాంతానికి చెందిన నవీన్‌ రెడ్డి, హేమ అనే యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న పెద్దలు పెళ్లి జరిపించేందుకు అంగీకరించలేదు. ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని భావించిన ప్రేమజంట, 15 రోజుల క్రితం వివాహం చేసుకుంది.

ఈ క్రమంలో శనివారం రాత్రి నవీన్‌ రెడ్డి కుటుంబసభ్యులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి, అడ్డువచ్చిన వారిని కొట్టి, హేమను ఎత్తుకెళ్లి పోయారు. తన భార్యను ఆమె కుటుంబ సభ్యులే కిడ్నాప్‌ చేశారని ఆరోపిస్తూ, నవీన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంలో కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Hyderabad
Police
Kidnap
Lovers
Marriage

More Telugu News