ఆందోళన వద్దు.. టీవీ ప్రసారాలు ఆగిపోవు: స్పష్టం చేసిన ట్రాయ్
- టీవీ ప్రసారాలు ఆగిపోనున్నాయంటూ వార్తలు
- చానళ్ల ప్రసారాలు యథావిధిగా కొనసాగుతాయన్న ట్రాయ్
- తగిన చర్యలు తీసుకోవాలంటూ కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు
మార్చి 2017లో ప్రసార, కేబుల్ సేవలకు సంబంధించి ట్రాయ్ సరికొత్త నియంత్రణ విధివిధానాలను జారీ చేసింది. జూలై 3, 2018లో వీటిని తిరిగి జారీ చేస్తూ అమలు షెడ్యూలును నిర్దేశించింది. అయితే, వివిధ టీవీల్లో వస్తున్న ప్రకటనల్లో స్పష్టత లేకపోవడంతో ఈ నెల 29 నుంచి చందా చెల్లించని చానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో స్పందించిన ట్రాయ్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. కొత్త విధివిధానాల అమలు కారణంగా టీవీ సేవల్లో ఎటువంటి అంతరాయం ఉండదని పునరుద్ఘాటించింది.