ముంబైలోని జిన్నా హౌస్ మాదే.. భారత్కు హక్కులేదు: పాక్
- సుష్మా వ్యాఖ్యలపై పాక్ స్పందన
- జిన్నా హౌస్ తమదేనని వాదన
- భారత ప్రయత్నాలను అంగీకరించబోమన్న పాక్
యూరోపియన్ శైలిలో సముద్రం ఒడ్డును నిర్మించిన ఈ బంగ్లాలో పాకిస్థాన్ ఫౌండర్ మహ్మద్ అలీ జిన్నా నివసించేవారు. 1930 వరకు ఆయన అక్కడే నివసించారు. జిన్నా తమవాడని, కాబట్టి ఈ బంగ్లాను తమ పేరుపై బదిలీ చేయాలని గతకొన్నాళ్లుగా పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది. తాజాగా, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. జిన్నా హౌస్ను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేరుపై బదిలీ చేసే ప్రయత్నాలు ప్రారంభమైనట్టు చెప్పారు. దీంతో స్పందించిన పాక్ ఈ వ్యాఖ్యలు చేసింది.