కేంద్రాన్ని యాచించకుండా శాసించి మన హక్కులను సాధించుకోవాలి: కేటీఆర్
- మొత్తం 16 ఎంపీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ ను గెలిపించాలి
- కాంగ్రెస్, బీజేపీలతో తెలంగాణకు ఒరిగేదేమీలేదు
- ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చోవాలో ‘తెలంగాణ’ నిర్ణయించాలి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ లేదా బీజేపీలు అధికారంలో ఉంటే తెలంగాణకు ఒరిగేదేమీలేదని, కేంద్రంలో మనం నిర్ణయాత్మక పాత్రలో ఉంటేనే మన హక్కులు, నిధులు సాధించుకోవచ్చని.. బంగారు తెలంగాణను నిర్మించుకోవచ్చని అన్నారు. ఖమ్మంతో సహా 16 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి, ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చోవాలో తెలంగాణ రాష్ట్రం నిర్ణయించే దిశగా సమాయత్తమవుదామని కేటీఆర్ విజ్ఞప్తి నిచ్చారు.