పటేల్ అంటే మాకు ఎంతో గౌరవం: మల్లికార్జున్ ఖర్గే
- పటేల్ను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు
- ఇదంతా పొలిటికల్ స్టంట్
- రాహుల్, సోనియా చెప్పినట్టు నడుచుకుంటా
దేశం కోసం అన్ని రాష్ట్రాలకు చెందిన నేతలు పోరాడారని, త్యాగాలు చేశారని, వారిని ఎందుకు స్మరించుకోవడం లేదని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. 70 ఏళ్లుగా బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఎందుకు వారిని స్మరించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇదంతా 'పొలిటికల్ స్టంట్' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు చాలా తెలివైన వారని, 2019లో మంచి నిర్ణయం తీసుకుంటారని తనకు నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. మీడియాతో బుధవారం మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.