పని ప్రదేశంలో మహిళలపై వేధింపులు ఏపీ, తెలంగాణలో తక్కువే: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ

  • పనిచేసే ప్రదేశంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులు
  • ఏపీ, తెలంగాణలో మెరుగైన వాతావరణం
  • గణాంకాలు విడుదల చేసిన కేంద్రం
పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొంత మెరుగైన వాతావరణం ఉంది. పనిచేస్తున్న ప్రదేశంలో మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసులు 2014-17 మధ్య 54 శాతం పెరిగాయి. అయితే, వివిధ పెద్ద రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఏపీ, తెలంగాణలో ఇవి నామమాత్రమేనని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి విభాగం తెలిపింది. ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది.

జాతీయ మహిళా కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 31 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 48 కేసులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది జూలై వరకు ఏపీలో రెండు కేసులు మాత్రమే నమోదు కాగా, తెలంగాణలో పది కేసులు నమోదయ్యాయి.

లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ 2017లో 570 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జూలై నాటికే 533 కేసులు నమోదైనట్టు చెప్పారు. వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేయడం కోసం ఆన్‌లైన్ ఫిర్యాదు విధానం ‘షి బాక్స్’ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
Go Back to Shorts
Women
Andhra Pradesh
Telangana
NCW
Workplace
Harassment

More Telugu News