టాంజానియాలో భారత సంతతి బిలియనీర్ కిడ్నాప్!
- దార్ ఏ సలామ్ లో ఘటన
- లగ్జరీ హోటల్ లోకి ప్రవేశించిన సాయుధులు
- గాల్లోకి కాల్పులు జరిపి మహమ్మద్ డ్యూజీ కిడ్నాప్
డ్యూజీని కిడ్నాప్ చేసే ముందు వారు గాల్లోకి కాల్పులు జరిపారని స్థానిక పోలీస్ కమిషనర్ మాంబోసాసో వెల్లడించారు. తాము వివరాలు సేకరిస్తున్నామని, ఘటన జరిగిన సమయంలో హోటల్ లో ఉన్న వారిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. కిడ్నాప్ చేసినవారు టాంజానియన్లు కాదని, వారు విదేశీయులని గుర్తించామని, జిమ్ లోకి వెళ్లిన వారు ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పారు.
కాగా, మహమ్మద్ డ్యూజీని కిడ్నాప్ చేయడానికి కారణం ఏంటన్న విషయం ఇంకా తెలియరాదేదు. పలు రకాల వ్యాపారాలు చేస్తున్న మహమ్మద్ డ్యూజీ, టాంజానియన్ లో యువ బిలియనీర్ గా గుర్తింపు పొందాడు.