జగన్, విజయసాయిలది రూ.43 వేల కోట్ల అవినీతి!: కనకమేడల రవీంద్రకుమార్
- అవినీతి కేసుల్లో మునిగిపోయారు
- ఎన్నికలవగానే విదేశాలకు పారిపోయేందుకు యత్నం
- రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు
ఎన్నికలు కాగానే విదేశాలకు పారిపోవడానికి వైసీపీ నేతలు ఇప్పటినుంచే ప్రయత్నిస్తున్నారని రవీంద్ర కుమార్ విమర్శించారు. బుందేల్ఖండ్ మాదిరిగా ప్యాకేజీని ఏపీకి ఇస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు విజయసాయిరెడ్డి జార్జియా వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారని రవీంద్ర కుమార్ ఆరోపించారు. కేంద్రంతో కుమ్మక్కైన వైసీపీ మాజీ ఎంపీలు.. ఎన్నికలు రావని తెలిసే రాజీనామాలు చేశారని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ జీవీఎల్, ఆ పార్టీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని రవీంద్ర కుమార్ విమర్శించారు.