అరకు ఘటనపై కీలక ఆధారాలు సేకరించాం: ఏపీ డీజీపీ ఠాకూర్
- కిడారి, సోమను కాల్చి చంపడం దురదృష్టకరం
- కాల్పుల్లో పాల్గొన్న వారి ఆధారాలు దొరికాయి
- నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం
కిడారి, సోమ లను వారు ఎందుకు చంపారో దర్యాప్తులో తేలుతుందని, ఈ ఘటనపై మావోయిస్టుల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా వెలువడలేదని అన్నారు. పోలీస్-మావోయిస్టుల మధ్య ఇది నిరంతర పోరాటమన్న ఠాకూర్, రామగూడ ఎన్ కౌంటర్ తర్వాత చాలాసార్లు ప్రతీకార చర్యలకు మావోయిస్టులు పథకం వేశారని, పోలీసులు ఏడుసార్లు తప్పించుకున్నారని చెప్పారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో సమస్యలు ఉన్నాయని, ఏపీ-ఒడిశా పోలీసుల మధ్య సమన్వయ లోపం వాస్తవమేనని అన్నారు. భవిష్యత్ లో కేంద్రం, ఏపీ, ఒడిశా పోలీసులు సమన్వయంతో పనిచేస్తారని ఠాకూర్ చెప్పారు.