కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు!

  • కుంతియాపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలపై స్పందన
  • రాజగోపాల్ రెడ్డి రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలి
  • క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ కుంతియాపై ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, రెండు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో క్రమశిక్షణా కమిటీ పేర్కొంది. కాగా, రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈరోజు ఉదయం క్రమశిక్షణా సంఘం చర్చించింది. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించొద్దని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం.
Go Back to Shorts
komati reddy
rajagopal reddy
show cause notice

More Telugu News