రూ. 12,885 కోట్ల అప్పులు చెల్లించలేక దివాలా తీసిన జీవీకే పవర్ లిమిటెడ్!
- ఐడీబీఐ బ్యాంకు నుంచి రుణం
- తిరిగి చెల్లించడంలో విఫలం
- నేడు లా ట్రైబ్యునల్ ముందుకు పిటిషన్
కాగా, ఐడీబీఐ బ్యాంకు నుంచి జీవీకే పవర్ తీసుకున్న రుణం, వడ్డీతో కలిపి గడచిన ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 12,885 కోట్లకు చేరింది. పంజాబ్ లోని తరన్ జిల్లా సమీపంలోని గోయింద్వాల్ సాహిబ్ గ్రామంలో రెండు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను జీవీకే పవర్ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల అభివృద్ధి నిమిత్తం పొందిన రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతోనే ఐడీబీఐ బ్యాంకు దివాలా పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకుంది.