ప్రగతి నివేదన సభ నిర్వహించడం మీవల్ల కాదు: రేవంత్ రెడ్డి ఎద్దేవా
- రాహుల్ గాంధీ పర్యటన సక్సెస్ తో దిక్కుతోచని స్థితిలో టీఆర్ఎస్
- ప్రగతి నివేదన సభ ఉద్దేశం ప్రజల దృష్టి మరల్చడమే
- దేవుడు దిగి వచ్చినా సభ నిర్వహణ సాధ్యం కాదన్న రేవంత్ రెడ్డి
ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సభ సాధ్యం కాదని నిఘా వర్గాలు నివేదిక ఇచ్చాయని, ఒకవేళ సెప్టెంబర్ 2న సభ పెట్టినా 25 లక్షల మంది కూడా రారని అన్నారు. ప్రజలను ఇంకెంతోకాలం మోసం చేయలేరని చెప్పిన రేవంత్ రెడ్డి, ఎప్పుడూ ఏదో ఒక డ్రామా చేసే కేసీఆర్ ఇప్పుడు ముందస్తు ఎన్నికల డ్రామాకు దిగినట్టు తెలిపారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదనే అసత్య ప్రచారానికి టీఆర్ఎస్ నేతలు దిగుతున్నారని, అది వారి దిగజారుడుతనమని రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీతో పొత్తుపై పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని ఆయన చెప్పారు.