Atal Bihari Vajpayee: వాజ్ పేయి మృతి భారత్ కి ఎంతో నష్టం!: సచిన్ టెండూల్కర్

షార్ట్స్‌లో చూడండి
క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన, నిబద్ధత కలిగిన నాయకుడు, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు సాయంత్రం 05.05 గంటలకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతిపై టీం ఇండియా క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సంతాపాన్ని తెలిపారు. వాజ్‌పేయి మృతితో భారతదేశం ఎంతో నష్టపోయిందని ఆయన అన్నారు. ‘‘ఈరోజు భారత్ చాలా నష్టపోయింది. భారత దేశానికి అటల్ బిహారీ వాజ్‌పేయి జీ ఎన్నో అసంఖ్యాకమైన సేవలు అందించారు. ఆయన కుటుంబసభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని సచిన్ టెండూల్కర్  ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Atal Bihari Vajpayee

More Telugu News