బీరు ప్రియులకు చేదు వార్త.. తెలంగాణలో పెరగనున్న ధరలు
- ధరలు పెంచాలని రేట్ కాంట్రాక్ట్ కమిటీ సిఫారసు
- బెవరేజెస్ కార్పొరేషన్ ఆమోదం తెలిపాక.. సీఎం వద్దకు ఫైల్
- కేసీఆర్ సంతకం తర్వాత పెరగనున్న ధరలు
రిటైర్ట్ జడ్జి, రిటైర్డ్ ఐఏఎస్, చార్టెర్డ్ అకౌంటెంట్ తో కూడిన ఈ త్రిసభ్య కమిటీ... బ్రూవరీ కంపెనీల నుంచి విన్నపాలను స్వీకరించింది. ఎంతమేరకు బేస్ ప్రైజ్ ను పెంచవచ్చనే విషయంపై చర్చించింది. ఈ సందర్భంగా కొన్ని కంపెనీలు 12 శాతం, మరి కొన్ని కంపెనీలు 15 శాతం పెంచాలంటూ కోరాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న కమిటీ... చివరకు 9, 10 శాతం పెంచాలంటూ ప్రభుత్వానికి సూచించింది.
ప్రస్తుతం ఈ సిఫారసులు ఎక్సైజ్ కమిషనరేట్ కు చేరాయి. దీనికి తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కు చెందిన బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలపాల్సి ఉంది. అనంతరం ఈ ఫైలు ముఖ్యమంత్రి వద్దకు వెళుతుంది. సీఎం కేసీఆర్ సంతకం చేయగానే బీరు ధరలు పెరుగుతాయి.