అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆమ్రపాలి!
- స్వయంగా ఆదేశాలు ఇచ్చినా స్పందించని అధికారులు
- అసహనాన్ని వ్యక్తం చేసిన కలెక్టర్
- తొలితప్పుగా భావించి మందలింపుతో సరిపెడుతున్నానని వెల్లడి
మూడు వారాల క్రితం ఆసుపత్రిలో డిప్యుటేషన్ పై ఉన్న వైద్యుల సేవలను వినియోగించుకోవాలని, కాన్పులకు వచ్చే వారి కోసం స్కానింగ్ మెషీన్, నీటి శుద్ధి యంత్రాలు, జనరేటర్ కోసం అంచనాలు సమర్పించాలని సూచించినా, అధికారులు ఆ పని చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ఆదేశాలను పాటించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేసిన ఆమె, తొలితప్పుగా భావిస్తూ ఇప్పటికి మందలించి వదిలేస్తున్నానని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.