ఎమ్మెల్యే రోజాపై మండిపడ్డ ఏపీ మంత్రి అఖిలప్రియ
- రోజాకు ఎదుటివారిని విమర్శించడం మాత్రమే తెలుసు
- అప్పట్లో అసెంబ్లీ నుంచి సస్పెండయినప్పటికీ తీరు మార్చుకోలేదు
- బీజేపీతో కలిసి జగన్, పవన్ కుట్ర
ప్రత్యేక హోదా కోసం టీడీపీ మాత్రమే పోరాటం చేస్తోందని అఖిలప్రియ అన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. ఏపీకి జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకంగా తాము కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని, ప్రజలందరినీ చైతన్య పరుస్తామని అన్నారు.