ఫేస్ బుక్ కు మరో చిక్కు... వివరణ కోరుతూ సమన్లు పంపిన జర్మనీ
- 3 కోట్ల జర్మనీ యూజర్ల సమాచారాన్ని కాపాడారా?
- దీనిపై వివరణ ఇవ్వాలన్న జర్మనీ న్యాయ మంత్రి
- చర్చలకు రావాలంటూ సమన్లలో ఆదేశం
జర్మనీ న్యాయ మంత్రి కటారినా బార్లే సమన్లు పంపారు. ఈ మేరకు జర్మనీ పత్రికలు ఈ రోజు కథనాలను ప్రచురించాయి. ‘‘జర్మనీకి చెందిన 3 కోట్ల మంది యూజర్ల డేటాకు ఏం జరిగింది? అన్నదే ప్రశ్న. వినియోగదారుల రక్షణకు సంబంధించి ఇది కీలకమైనది’’ అని బార్లే అన్నారు. జర్మనీ న్యాయ శాఖ కార్యాలయంలో చర్చలకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. యూజర్ల డేటా దుర్వినియోగం జరగకుండా నివారించేందుకు స్పష్టమైన నిబంధనలు అవసరమని, ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు అని అభిప్రాయపడ్డారు.