కొత్త రకం వరి వంగడాలు సృష్టించిన రైతు.. తల్లిదండ్రుల పేరు పెట్టిన వైనం!
- సరికొత్త వరి వంగడాలను సృష్టించిన కన్నడ రైతు
- ఈ వంగడాలకు తన తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా నామకరణం
- ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి
ఈ వంగడం ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల ధాన్యం దిగుబడిని ఇస్తుందని, విత్తనం చల్లిన రోజు నుంచి లెక్కవేస్తే 135 రోజుల్లోనే పంట చేతికి వస్తుందని ఆయన తెలిపారు. ఈ వంగడం పలు రకాల తెగుళ్లను తట్టుకుని దిగుబడినిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ రకం వంగడాన్ని సాగు చేయటం ప్రారంభించిన తరువాత వచ్చిన దిగుబడి చూసి, తన చుట్టుపక్కల రైతులు కూడా సాగు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ వంగడాన్ని మార్కెటింగ్ చేసేందుకు 'సహజ సంవృద్ధ' అనే సంస్థ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు.