ప్రియుడితో వెళ్లిపోవడమే ఆమె చేసిన నేరం... ముజఫర్ నగర్ లో దారుణం!
- కొన్ని నెలల క్రితం ప్రియుడితో వెళ్లిపోయిన యువతి
- పరువు పోయిందని భావించిన కుటుంబ సభ్యులు
- గాలించి ఆమె అడ్రెస్ గుర్తింపు
దీంతో తమ పరువు తీసిందని భావించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెపై పగపెంచుకున్నారు. ఆమె కోసం తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు ఆమె అడ్రెస్ తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లిన కన్న తండ్రితో పాటు రక్తం పంచుకుని పుట్టిన సోదరుడు, మరో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. విషయం చెబితే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో బాధితురాలు జరిగిన అమానవీయ ఘటనకు కుమిలిపోతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలహాబాదు కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని, కోర్టులో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని పోలీసులు తెలిపారు.