కేంద్రం మరో సంచలన నిర్ణయం.. ఇక 'చెక్'కు చెక్!
- అతి త్వరలో చెక్బుక్కు మంగళం
- డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యం
- ‘డిజిటల్ రథ్’ను ప్రారంభించిన సీఏఐటీ
కరెన్సీ ముద్రణకు కేంద్రం రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, వాటి భద్రత, రవాణా కోసం మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. డెబిట్ కార్డు లావాదేవీలపై 1 శాతం, క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2 శాతం చార్జీలను బ్యాంకులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల డెబిట్ కార్డు వినియోగదారులుంటే అందులో ఐదుశాతం మంది మాత్రమే నగదు రహిత లావాదేవీలకు వాటిని ఉపయోగిస్తున్నారని, మిగతావారు డబ్బులు డ్రా చేసుకోవడానికి మాత్రమే తమ కార్డులను ఉపయోగిస్తున్నారని ఖండేవాల్ వివరించారు.