విదేశాల నుంచి ఎక్కువ డబ్బు పంపిస్తున్నది భారతీయులే!
- గతేడాది స్థానాన్ని పదిల పర్చుకోనున్న భారత్
- 2017లో 65 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం
- ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి
దీని ప్రకారం 2017లో 65 బిలియన్ డాలర్ల డబ్బును మాతృదేశానికి పంపి భారతీయులు మొదటిస్థానాన్ని స్థిరంగా ఉంచుకోనున్నారు. గతేడాది కూడా 62.7 బిలియన్ డాలర్లతో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా (61 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ (33 బి.డాలర్లు), మెక్సికో (31 బి.డాలర్లు), నైజీరియా (22 బి.డాలర్లు) ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలా వస్తున్న డబ్బు 3.9% పెరిగి 596 బిలియన్లు ఉంటుందని అంచనా వేసింది. పాకిస్థాన్కు వస్తున్న డబ్బులో మార్పు లేదు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లకు మాత్రం ధన ప్రవాహం తగ్గింది.