సెహ్వాగ్ ఆడతాడంటేనే భయపడేవాడ్ని: ఇంజమామ్
ఇక ప్రత్యర్థులను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేసే ఇంజమామ్ ఒక బ్యాట్స్ మన్ అంటే మాత్రం భయపడేవాడట. జియో స్పోర్ట్స్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ మాట్లాడుతూ, వీరేంద్ర సెహ్వాగ్ క్రీజులోకి దిగితే భయమేసేదని తెలిపాడు. సెహ్వాగ్ అవుటైతే సరే కానీ, క్రీజులో నిలబడ్డాడంటే మాత్రం స్కోరు బోర్డు ఆగేది కాదని అన్నాడు. సెహ్వాగ్ 80 పరుగులు చేశాడంటే టీమిండియా 300 పరుగులు చేస్తుందనే భయం తనలో నెలకొనేదని చెప్పాడు. అంతే కాదని, సెహ్వాగ్ ఎంత సేపు క్రీజులో ఉంటే బౌలర్ ఆత్మవిశ్వాసం అంతగానూ దెబ్బతింటుందని అన్నాడు. అదే కెప్టెన్ గా తనను ఇబ్బందికి గురిచేసేదని అన్నాడు.