మాఘ స్నాన ఫలితం

మాఘ స్నాన ఫలితం

కార్తిక మాసంలో దీపారాధన చేయడం వలన ఎంతటి విశేషమైన ఫలితం లభిస్తుందో, మాఘమాసంలో చేసే నదీ స్నానం వలన అంతటి విశేషమైన ఫలితమే లభిస్తుందనేది మహర్షుల మాట. అందువల్లనే మాఘమాసంలో నదీ స్నానానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో తెల్లవారు జామునే నిద్రలేచి నదీ స్నానం చేయాలి. అందుకు అవకాశం లేకపోతే నదులను తలచుకుంటూ బావి నీటితో స్నానం చేసినా అదే ఫలితం ఉంటుంది.

 ఆ తరువాత  వైష్ణవ ఆలయాలను దర్శించి స్వామివారికి పూజలు చేయించడం వలన పుణ్యరాశి పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మాఘ ఆదివారాలు మహా విశేషమైనవి. ఈ రోజులలో చేసే సూర్య నమస్కారాల వలన .. ఆరాధనలు వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ మాసంలో శివాలయాలకు వెళ్లి అక్కడ 'నువ్వుల నూనె'తో దీపారాధన చేయడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి .. సకల శుభాలు చేకూరతాయనేది శాస్త్ర వచనం. 

More Bhakti Articles