ముందు మీడియా వాళ్లు గౌరవిస్తే... ఆ తర్వాత అందరూ గౌరవిస్తారు: విజయశాంతి

  • సినీ మీడియా ప్రతినిధులకు విజయశాంతి కీలక రిక్వెస్ట్ 
  • ఇంటర్వ్యూల సమయంలో హీరోయిన్లను నువ్వు అని కాకుండా మీరు అని గౌరవంగా సంభోధించాలని సూచన
  • అర్జున్ సన్నాఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లో ఈ సూచన చేసిన విజయశాంతి  
ఎమ్మెల్సీ విజయశాంతి మీడియాకు ఒక విజ్ఞప్తి చేశారు. నటీమణులను మీడియా గౌరవిస్తే అందరూ గౌరవిస్తారని ఆమె అన్నారు.

ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందిన విజయశాంతి ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా కొనసాగుతూనే 'సర్కార్ వారి పాట' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీలో నిజాయితీగల పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఆమె విలేఖరుల ప్రవర్తనపై అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొందరు విలేఖరులు నటీమణులను ఇంటర్వ్యూ చేసే సమయంలో 'నువ్వు' అంటూ ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఆమె అన్నారు. అలా కాకుండా 'మీరు' అని సంబోధిస్తే గౌరవంగా ఉంటుందని ఆమె సూచించారు. తాను చాలా ఇంటర్వ్యూలు చూశానని ఆమె తెలిపారు.

హీరోలతో పాటు హీరోయిన్లను కూడా గౌరవించాలని ఆమె కోరారు. మీడియా గౌరవిస్తే అందరూ గౌరవిస్తారని ఆమె పేర్కొన్నారు. తన సూచనను తప్పుగా అర్థం చేసుకోవద్దని, ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని విజయశాంతి స్పష్టం చేశారు. 


More Telugu News