రేపే ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

  • వెల్ల‌డించిన‌ విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ 
  • ఉయదం 11 గంటలకు ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ఫలితాలు విడుద‌ల‌
  • ఈ ఏడాది పరీక్షలకు ఇంటర్ ఫస్టియర్‌, సెకండ్ ఇయర్ కలిపి 10 లక్షలకుపైగా విద్యార్థులు హాజ‌రు
ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు శ‌నివారం నాడు (ఏప్రిల్‌ 12న) విడుదల చేస్తున్న‌ట్లు విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఉయదం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్న‌ట్లు తెలిపారు. ఒకేసారి ఫస్టియర్‌, సెకండ్ ఇయర్ ఫ‌లితాలు రిలీజ్ చేస్తామ‌న్నారు. 

ఫ‌లితాల కోసం ప్ర‌భుత్వ అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.inతో పాటు మ‌న మిత్ర నంబ‌ర్‌ 9552300009కు హాయ్ అని సందేశం పంపి తెలుసుకోవ‌చ్చని మంత్రి అన్నారు.  కాగా, ఈ ఏడాది ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం కలిపి దాదాపు 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షల‌కు హాజ‌రైన‌ విష‌యం తెలిసిందే. వీరంతా ఎప్పుడెప్పుడాని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. 


More Telugu News