ఏపీకి మరో భారీ పెట్టుబడి?.. హెచ్డీ కొరియా షిప్బిల్డింగ్తో మంత్రి లోకేశ్ భేటీ
- దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేట.. షిప్బిల్డింగ్ దిగ్గజం హెచ్డీ కోస్తో లోకేశ్ భేటీ
- ఏపీలో సముద్ర రవాణా, షిప్ బిల్డింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
- సుదీర్ఘ తీరప్రాంతం, పోర్టులు, అనుకూల పాలసీలే మా బలమని వివరించిన మంత్రి
- ఏపీలో సైట్ల పరిశీలనకు అంగీకరించిన హెచ్డీ కోస్.. రాష్ట్ర పర్యటనకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తన దక్షిణ కొరియా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత నౌకా నిర్మాణ, ఇంజనీరింగ్ సంస్థ హెచ్డి కొరియా షిప్బిల్డింగ్ & ఆఫ్షోర్ ఇంజనీరింగ్ (హెచ్డీ కోస్) ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఏపీలో సముద్ర రవాణా, షిప్బిల్డింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కంపెనీ గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ క్విన్ యంగ్హూన్, టీమ్ లీడర్ హోంగ్ సున్జూన్లను లోకేశ్ ఆహ్వానించారు.
ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వివరించారు. "భారత తూర్పు తీరంలో 1053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంతో ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ప్రదేశంలో ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఆరు పోర్టులతో పాటు కొత్తగా రాబోతున్న డీప్-వాటర్ పోర్టులు, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు మా రాష్ట్ర ప్రత్యేకతలు" అని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానం ద్వారా కంపెనీలు తమ ప్రాజెక్టులను అత్యంత వేగంగా ఏర్పాటు చేసుకోవచ్చని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇందుకు కియా మోటార్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి కొరియన్ కంపెనీల విజయాలే నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. "భారీ పారిశ్రామిక ప్రాజెక్టులను అతి తక్కువ సమయంలో పూర్తిచేసిన చరిత్ర, సామర్థ్యం మా రాష్ట్రానికి ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ ప్రాజెక్టులు ఇటీవల ఏపీని ఎంచుకున్నాయి. ఇది మా పారిశ్రామిక వాతావరణంపై ప్రపంచ కంపెనీలకు పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది" అని మంత్రి అన్నారు. దేశంలోకి వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడులలో 25% వాటాతో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
మంత్రి లోకేశ్ ఆహ్వానంపై హెచ్డి కోస్ గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ క్విన్ యంగ్హూన్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి షిప్బిల్డింగ్, సముద్ర ఇంజనీరింగ్ ఉపకరణాల తయారీ యూనిట్ల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. "మా సాంకేతిక, లాజిస్టికల్, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా సరైన ప్రాంతాలను గుర్తించి మా అధికారులు మీకు తెలియజేస్తారు. దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమైన పారిశ్రామిక వాతావరణాన్ని ఏపీ అందించగలదని మేము విశ్వసిస్తున్నాం" అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా చూసేందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యేందుకు ఏపీకి రావాల్సిందిగా హెచ్డీ కోస్ నాయకత్వాన్ని మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. ఈ సమావేశం విజయవంతం కావడంతో ఏపీ తీరంలో మరో భారీ పెట్టుబడికి మార్గం సుగమమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వివరించారు. "భారత తూర్పు తీరంలో 1053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంతో ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ప్రదేశంలో ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఆరు పోర్టులతో పాటు కొత్తగా రాబోతున్న డీప్-వాటర్ పోర్టులు, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు మా రాష్ట్ర ప్రత్యేకతలు" అని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానం ద్వారా కంపెనీలు తమ ప్రాజెక్టులను అత్యంత వేగంగా ఏర్పాటు చేసుకోవచ్చని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇందుకు కియా మోటార్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి కొరియన్ కంపెనీల విజయాలే నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. "భారీ పారిశ్రామిక ప్రాజెక్టులను అతి తక్కువ సమయంలో పూర్తిచేసిన చరిత్ర, సామర్థ్యం మా రాష్ట్రానికి ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ ప్రాజెక్టులు ఇటీవల ఏపీని ఎంచుకున్నాయి. ఇది మా పారిశ్రామిక వాతావరణంపై ప్రపంచ కంపెనీలకు పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది" అని మంత్రి అన్నారు. దేశంలోకి వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడులలో 25% వాటాతో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
మంత్రి లోకేశ్ ఆహ్వానంపై హెచ్డి కోస్ గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ క్విన్ యంగ్హూన్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి షిప్బిల్డింగ్, సముద్ర ఇంజనీరింగ్ ఉపకరణాల తయారీ యూనిట్ల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. "మా సాంకేతిక, లాజిస్టికల్, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా సరైన ప్రాంతాలను గుర్తించి మా అధికారులు మీకు తెలియజేస్తారు. దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమైన పారిశ్రామిక వాతావరణాన్ని ఏపీ అందించగలదని మేము విశ్వసిస్తున్నాం" అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా చూసేందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యేందుకు ఏపీకి రావాల్సిందిగా హెచ్డీ కోస్ నాయకత్వాన్ని మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. ఈ సమావేశం విజయవంతం కావడంతో ఏపీ తీరంలో మరో భారీ పెట్టుబడికి మార్గం సుగమమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.