ఓపెన్-ఇయర్ టెక్నాలజీతో బోట్ కొత్త రకం ఇయర్బడ్స్.. ధర రూ.1599
- బోట్ నుంచి కొత్త ఎయిర్డోప్స్ ప్రోక్లిప్ విడుదల
- ప్రారంభ ధర రూ.1,599
- ఓపెన్-ఇయర్ డిజైన్తో ప్రత్యేకత
- 52 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
- బ్లూటూత్ 6.0, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ
భారతీయ ఆడియో బ్రాండ్ బోట్ కొత్తగా ఎయిర్డోప్స్ ప్రోక్లిప్ ఇయర్బడ్స్ను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.1,599గా నిర్ణయించింది. సాటిన్ వైట్, సిల్క్ గ్రే, వెల్వెట్ వైన్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి.
ఈ ఇయర్బడ్స్లో ప్రధాన ఆకర్షణ ఓపెన్-ఇయర్ డిజైన్. సాధారణ ఇయర్బడ్స్లా చెవిలోపలికి వెళ్లకుండా చెవి బయట భాగానికే అమరేలా వీటిని రూపొందించారు. దీంతో పాటలు వింటూనే చుట్టూ ఉన్న శబ్దాలు కూడా వినిపిస్తాయి. ట్రాఫిక్లో ప్రయాణించే వారు, జాగింగ్ చేసే వారు, సైక్లింగ్ చేసే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఇందులో ఎయిర్ కండక్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. 12 ఎంఎం డైనమిక్ డ్రైవర్లు ఉండటంతో మంచి ఆడియో అనుభూతి లభిస్తుందని కంపెనీ పేర్కొంది. బయటకు శబ్దం తక్కువగా వెళ్లేలా ప్రత్యేక ఫీచర్ను కూడా ఇచ్చింది. ఫోన్ కాల్స్ కోసం ఏఐ ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం అందుబాటులో ఉంది. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీతో పాటు ఒకేసారి రెండు డివైజ్లకు కనెక్ట్ అయ్యే సదుపాయం కూడా ఉంది.
కంపెనీ యాప్ ద్వారా సౌండ్ సెట్టింగ్స్, టచ్ కంట్రోల్స్ను మార్చుకునే అవకాశం ఉంది. ఒక్కో ఇయర్బడ్ బరువు కేవలం 4.6 గ్రాములే కావడంతో ఎక్కువసేపు వాడినా ఇబ్బంది ఉండదని బోట్ చెబుతోంది. చెమట, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం ఐపీఎక్స్4 రేటింగ్ను కూడా ఇచ్చింది.
బ్యాటరీ విషయంలో ఈ డివైజ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 52 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. కొద్దిసేపు ఛార్జ్ చేస్తే గంటల తరబడి వినియోగించుకోవచ్చని తెలిపింది.