భార్యను కట్టేసి, గుండు గీసి, బలవంతంగా మూత్రం తాగించిన ప్రభుత్వ డ్రైవర్!
- ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లా పట్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో డ్రైవర్గా పనిచేస్తున్న నిందితుడు
- భార్య తారాబాయిపై వివాహేతర సంబంధం నెపంతో దాడి
- భర్త వేధింపులు తట్టుకోలేక విడిగా ఉంటూ ఇళ్లల్లో పనిచేస్తున్న భార్య
- ఆమెను వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడి చేసిన నిందితుడు
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. వీరిద్దరూ 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గత ఏడాది కాలంగా భర్త వేధింపులు, కుటుంబ కలహాల కారణంగా తారాబాయి తన నలుగురు పిల్లలతో కలిసి భర్తకు దూరంగా విడిగా నివసిస్తోంది. బతుకుదెరువు కోసం ఇళ్లల్లో పనిమనిషిగా చేరి జీవనం సాగిస్తోంది. జూన్ 14న ఆమె పట్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కోన పాండోపరా గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లగా, నిందితుడు జితేంద్ర అక్కడకు వెతుక్కుంటూ వచ్చాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతోనే తాను ఈ దాడికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించడమే కాకుండా, ఆ దృశ్యాలను తనే స్వయంగా ఫోన్లో రికార్డ్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే భర్త చేసిన ఆరోపణలను బాధితురాలు పూర్తిగా ఖండించింది.
ఈ అమానవీయ ఘటనపై ఛత్తీస్గఢ్ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో లభించిన డిజిటల్ సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నాన్-బెయిలబుల్ సెక్షన్లను అదనంగా చేర్చినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. ఈ దారుణ ఉదంతం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా గాయపడిన బాధితురాలికి, ఆమె పిల్లలకు ప్రభుత్వ పరంగా తగిన కౌన్సెలింగ్, రక్షణ కల్పించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.