గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ అవుట్!
- నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా యాప్ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
- గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ను తొలగించాలని ఆదేశాలు
- చీటింగ్ నెట్వర్క్లను అరికట్టేందుకు ఎన్టీఏ సిఫార్సు మేరకు ఈ చర్యలు
- జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా నిలిపివేయాలని ఆదేశం
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సిఫార్సుల మేరకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, సెక్షన్ 69ఏ కింద ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల ఫలితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ను తొలగించారు. యాపిల్ యాప్ స్టోర్లో కూడా ఈ యాప్ను తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనితో పాటు, జూన్ 30 వరకు టెలిగ్రామ్లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను నిలిపివేయాలని సూచించింది. పాత మెసేజ్లను ఎడిట్ చేస్తూ, పేపర్ లీక్ అయినట్లు కృత్రిమ ఆధారాలు సృష్టిస్తున్న ఉదంతాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
మే 2026లో జరిగిన నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు వెల్లువెత్తడంతో జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు టెలిగ్రామ్ ఛానెళ్లు, గ్రూపుల ద్వారా చీటింగ్ ముఠాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఎన్టీఏ గుర్తించింది. కొన్ని ఛానెళ్లను తొలగించినా సమస్య తీవ్రత తగ్గకపోవడంతో, దేశవ్యాప్త నిషేధానికి సిఫార్సు చేయగా, ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది.