అవి మామూలు తాబేళ్లు కాదు... విదేశీ గూఢచారులు: చైనా సంచలన ఆరోపణలు
- తమ సముద్ర జలాల్లో గూఢచారి తాబేళ్లు, చేపలు ఉన్నాయన్న చైనా
- విదేశీ గూఢచార సంస్థలే ఈ పని చేస్తున్నాయని తీవ్ర ఆరోపణ
- జంతువులకు సెన్సర్లు అమర్చి కీలక సమాచారం చోరీ చేస్తున్నాయని వెల్లడి
- దేశ భద్రతకు ముప్పు కలిగించేందుకే ఈ కుట్ర అని ప్రకటన
జూన్ 12న తన అధికారిక వీచాట్ ఖాతాలో "లోతైన నీలి సముద్రం కింద, అంతర్గత ప్రవాహాలు ఉద్ధృతంగా ఉన్నాయి" అనే శీర్షికతో ఈ వివరాలను వెల్లడించింది. తమ తీరప్రాంతాల్లోని నిర్దిష్ట ప్రదేశాల్లో కొన్ని పెద్ద సముద్ర జీవులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నాయని, అవి నీటి ఉష్ణోగ్రత, లవణీయత, సముద్ర ప్రవాహాలు వంటి సమాచారాన్ని సేకరించి, శాటిలైట్ ద్వారా విదేశాలకు చేరవేస్తున్నాయని చైనా పేర్కొంది. కేవలం జంతువులే కాకుండా, గూఢచర్యం కోసం సోలార్ పవర్డ్ వేవ్ గ్లైడర్లు, సెన్సర్ బాయ్లను కూడా వినియోగిస్తున్నారని తెలిపింది.
ఈ చర్యల ద్వారా సముద్రగర్భ పటాలను రూపొందించి, చైనా తీరప్రాంత రక్షణ వ్యవస్థలోని లోపాలను గుర్తించేందుకు విదేశాలు ప్రయత్నిస్తున్నాయని, ఇది జాతీయ భద్రతకు పెను ముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఈ ఆరోపణల్లో చైనా ఏ దేశం పేరునూ కూడా నేరుగా ప్రస్తావించలేదు.
చైనా ఆరోపణల అంతర్జాతీయ మీడియాలో ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ, స్వతంత్ర వర్గాలు మాత్రం వీటిని ధ్రువీకరించలేదు. సముద్ర జీవులకు సెన్సర్లు అమర్చడం సాంకేతికంగా సాధ్యమే అయినప్పటికీ, వాటిని గూఢచర్యం కోసం ప్రభావవంతంగా ఉపయోగించడం అత్యంత సవాలుతో కూడుకున్న వ్యవహారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.