భారత నౌకలపై దాడి చేసింది ఇరాన్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని ట్రంప్ ఆరోపణ
- హర్మూజ్ జలసంధిలో ఈ ఘటన జరిగిందని వెల్లడి
- శాంతి చర్చల నిబంధనలపై ఇరాన్ అబద్ధాలు చెబుతోందని విమర్శ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సంచలన ఆరోపణలు చేశారు. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న భారత నౌకలపై దాడులకు పాల్పడింది ఇరాన్ అని ఆయన ధ్వజమెత్తారు. ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసిందని తెలిపారు. అదేవిధంగా, ఇరు దేశాల మధ్య సాగుతున్న శాంతి చర్చల నిబంధనల విషయంలో ఇరాన్ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"గత రాత్రి హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అయితే, ఏ నౌకపై జరిగిన దాడి గురించి మాట్లాడుతున్నారో, మాట్లాడుతున్నారో, అందుకు తగిన ఆధారాలేమిటనే అంశాలను ట్రంప్ స్పష్టంగా పేర్కొనలేదు. ప్రస్తుతం ఇరాన్ నుంచి ఈ ఆరోపణలపై ఎటువంటి స్పందన రాలేదు. శాంతి చర్చలకు సంబంధించి ఇరాన్ వెల్లడిస్తున్న సమాచారానికి, వాస్తవ ఒప్పందాలకు పొంతన లేదని ట్రంప్ ఆరోపించారు.
గత కొంతకాలంగా హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడానికి అమెరికా నౌకా దిగ్బంధనాన్ని అమలు చేస్తుండగా, ప్రతిగా ఇరాన్ సైతం వాణిజ్య నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాల్లో భారత నావికులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. సెట్టెబెల్లో, మారివెక్స్ వంటి నౌకలపై అమెరికా దళాలు జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించగా, ఈ ఘటనలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
"గత రాత్రి హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అయితే, ఏ నౌకపై జరిగిన దాడి గురించి మాట్లాడుతున్నారో, మాట్లాడుతున్నారో, అందుకు తగిన ఆధారాలేమిటనే అంశాలను ట్రంప్ స్పష్టంగా పేర్కొనలేదు. ప్రస్తుతం ఇరాన్ నుంచి ఈ ఆరోపణలపై ఎటువంటి స్పందన రాలేదు. శాంతి చర్చలకు సంబంధించి ఇరాన్ వెల్లడిస్తున్న సమాచారానికి, వాస్తవ ఒప్పందాలకు పొంతన లేదని ట్రంప్ ఆరోపించారు.
గత కొంతకాలంగా హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడానికి అమెరికా నౌకా దిగ్బంధనాన్ని అమలు చేస్తుండగా, ప్రతిగా ఇరాన్ సైతం వాణిజ్య నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాల్లో భారత నావికులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. సెట్టెబెల్లో, మారివెక్స్ వంటి నౌకలపై అమెరికా దళాలు జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించగా, ఈ ఘటనలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.