ప్రధాని కారులో చైనా నిఘా పరికరమా? బ్రిటన్లో కలకలం!
- బ్రిటన్ ప్రధాని కారులో ట్రాకర్ ఆరోపణ
- చైనాకు డేటా వెళ్లిందని వాదన
- పార్లమెంట్లో మాజీ దౌత్యవేత్త వ్యాఖ్యలు
- స్పందించడానికి బ్రిటన్ ప్రభుత్వం నిరాకరణ
- ఆరోపణలను ఖండించిన చైనా
బ్రిటన్లో చైనా గూఢచర్యం ఆరోపణలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని అధికారిక కారులో చైనాకు సమాచారాన్ని పంపగలిగే ట్రాకింగ్ పరికరం గుర్తించారన్న సంచలన వాదన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ప్రస్తావనకు రావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
ఈ ఆరోపణలను బ్రిటన్కు చెందిన మాజీ దౌత్యవేత్త చార్ల్స్ పార్టన్ పార్లమెంట్ సభ్యుల ముందు వెల్లడించారు. 2022లో ప్రభుత్వ వాహనాల భద్రతా తనిఖీల సమయంలో ప్రధాని ఉపయోగించిన కారులో అనుమానాస్పద పరికరం బయటపడిందని చెప్పారు. ఆ పరికరం సెల్యులార్ మాడ్యూల్ ద్వారా చైనాకు డేటాను పంపుతున్నట్లు గుర్తించారని పేర్కొన్నారు.
సెల్యులార్ మాడ్యూల్స్ అనేవి మొబైల్ నెట్వర్క్ల ద్వారా సమాచారాన్ని పంపే ఎలక్ట్రానిక్ పరికరాలు. ప్రస్తుతం కార్లు, విమానాలు, స్మార్ట్ పరికరాల్లో ఇవి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. చైనాలో తయారైన ఓ సీల్డ్ కంపోనెంట్లో ఈ పరికరం దాచినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో పేర్కొన్న కారు ఏ ప్రధాని ఉపయోగించిందన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. ఆ సమయంలో బ్రిటన్లో బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్ ప్రధానులుగా పనిచేశారు.
ఈ ఆరోపణలపై బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. భద్రతకు సంబంధించిన అంశాలపై వ్యాఖ్యానించబోమని మాత్రమే తెలిపింది. ప్రధాని భద్రతను పర్యవేక్షించే మెట్రోపాలిటన్ పోలీసులు కూడా ఇదే వైఖరి అవలంబించారు. మరోవైపు చైనా ఈ ఆరోపణలను ఖండించింది. ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని పేర్కొంది. చైనా సంస్థలపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. అయితే ఈ ఘటనతో ప్రభుత్వ వాహనాలు, కీలక మౌలిక సదుపాయాల్లో ఉపయోగిస్తున్న విదేశీ సాంకేతిక పరికరాల భద్రతపై బ్రిటన్లో చర్చ మొదలైంది.
ఈ ఆరోపణలను బ్రిటన్కు చెందిన మాజీ దౌత్యవేత్త చార్ల్స్ పార్టన్ పార్లమెంట్ సభ్యుల ముందు వెల్లడించారు. 2022లో ప్రభుత్వ వాహనాల భద్రతా తనిఖీల సమయంలో ప్రధాని ఉపయోగించిన కారులో అనుమానాస్పద పరికరం బయటపడిందని చెప్పారు. ఆ పరికరం సెల్యులార్ మాడ్యూల్ ద్వారా చైనాకు డేటాను పంపుతున్నట్లు గుర్తించారని పేర్కొన్నారు.
సెల్యులార్ మాడ్యూల్స్ అనేవి మొబైల్ నెట్వర్క్ల ద్వారా సమాచారాన్ని పంపే ఎలక్ట్రానిక్ పరికరాలు. ప్రస్తుతం కార్లు, విమానాలు, స్మార్ట్ పరికరాల్లో ఇవి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. చైనాలో తయారైన ఓ సీల్డ్ కంపోనెంట్లో ఈ పరికరం దాచినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో పేర్కొన్న కారు ఏ ప్రధాని ఉపయోగించిందన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. ఆ సమయంలో బ్రిటన్లో బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్ ప్రధానులుగా పనిచేశారు.
ఈ ఆరోపణలపై బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. భద్రతకు సంబంధించిన అంశాలపై వ్యాఖ్యానించబోమని మాత్రమే తెలిపింది. ప్రధాని భద్రతను పర్యవేక్షించే మెట్రోపాలిటన్ పోలీసులు కూడా ఇదే వైఖరి అవలంబించారు. మరోవైపు చైనా ఈ ఆరోపణలను ఖండించింది. ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని పేర్కొంది. చైనా సంస్థలపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. అయితే ఈ ఘటనతో ప్రభుత్వ వాహనాలు, కీలక మౌలిక సదుపాయాల్లో ఉపయోగిస్తున్న విదేశీ సాంకేతిక పరికరాల భద్రతపై బ్రిటన్లో చర్చ మొదలైంది.