ఆఫ్ఘన్తో టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ.. ఆ తర్వాతి బంతికే అవుట్!
- న్యూ ఛండీగఢ్ లో టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ టెస్టు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్... టెస్టు కెరీర్ లో 122వ శతకం
- ఏకైక టెస్టులో పటిష్ఠ స్థితిలో టీమిండియా
ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో మెరిశాడు. అయితే, సెంచరీ పూర్తి చేసుకున్న ఆనందం అతనికి ఎంతోసేపు నిలవలేదు. శతకం బాదిన మరుసటి బంతికే పెవిలియన్ చేరి తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. టెస్టుల్లో ఇలా సెంచరీ పూర్తికాగానే ఔటవ్వడం రాహుల్కు ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆటలో భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఓపెనర్ రాహుల్ (100) సెంచరీకి తోడు, యువ ఆటగాడు సాయి సుదర్శన్ (81), కెప్టెన్ శుభ్మన్ గిల్ (65 బ్యాటింగ్) అర్ధశతకాలతో రాణించారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
ఇన్నింగ్స్ ఆరంభంలో యశస్వి జైస్వాల్ (24) త్వరగా ఔటైనప్పటికీ, రెండో వికెట్కు రాహుల్, సాయి సుదర్శన్ 139 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సుదర్శన్ ఔటయ్యాక, గిల్తో కలిసి రాహుల్ మూడో వికెట్కు 67 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే రాహుల్ తన 12వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జియావుర్ రెహ్మాన్ బౌలింగ్లో శతకం సాధించిన రాహుల్, ఆ తర్వాతి బంతికే కవర్ డ్రైవ్ ఆడి గుర్భాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. క్రీజులో కెప్టెన్ శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ (6) ఉన్నారు.
చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆటలో భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఓపెనర్ రాహుల్ (100) సెంచరీకి తోడు, యువ ఆటగాడు సాయి సుదర్శన్ (81), కెప్టెన్ శుభ్మన్ గిల్ (65 బ్యాటింగ్) అర్ధశతకాలతో రాణించారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
ఇన్నింగ్స్ ఆరంభంలో యశస్వి జైస్వాల్ (24) త్వరగా ఔటైనప్పటికీ, రెండో వికెట్కు రాహుల్, సాయి సుదర్శన్ 139 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సుదర్శన్ ఔటయ్యాక, గిల్తో కలిసి రాహుల్ మూడో వికెట్కు 67 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే రాహుల్ తన 12వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జియావుర్ రెహ్మాన్ బౌలింగ్లో శతకం సాధించిన రాహుల్, ఆ తర్వాతి బంతికే కవర్ డ్రైవ్ ఆడి గుర్భాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. క్రీజులో కెప్టెన్ శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ (6) ఉన్నారు.