రొయ్యలకు మేత వేసి, పొలంలో దుక్కి దున్ని... సొంతూరులో మంత్రి నిమ్మల... వీడియో ఇదిగో!
- ఆదివారం సొంతూరు అగర్తిపాలెంలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు
- సైకిల్పై ప్రయాణించి, తన పొలంలో ట్రాక్టర్తో దుక్కి
- సొంత రొయ్యల చెరువులో మేత వేసి, రొయ్యల ఎదుగుదల పరిశీలన
- జలజీవన్ పైప్లైన్ పనుల విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు
- ఈ వివరాలను మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో స్వయంగా పంచుకున్న వైనం
ఆదివారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సైకిల్పై బయలుదేరిన రామానాయుడు, 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంతూరు అగర్తిపాలెం చేరుకున్నారు. అక్కడ తన రొయ్యల చెరువులో మేత వేసి, రొయ్యల ఎదుగుదలను పరిశీలించారు. అనంతరం వరి పొలంలోకి దిగి, ట్రాక్టర్తో స్వయంగా దుక్కి దున్నారు. కూలీలతో మాట్లాడారు. ఆ తర్వాత, గ్రామస్థులతో కలిసి శ్రమదానంతో అభివృద్ధి చేస్తున్న హిందూ శ్మశానవాటిక పనుల పురోగతిని సమీక్షించారు.
తిరిగి పాలకొల్లుకు సైకిల్పై పయనం అవుతుండగా, రోడ్డు పక్కన వేస్తున్న జలజీవన్ మిషన్ పైపులైన్ను గమనించారు. భవిష్యత్తులో మరమ్మతుల కోసం కొత్తగా మంజూరైన సిమెంట్ రోడ్డును తవ్వాల్సిన అవసరం రాకుండా, పైప్లైన్ను పక్కగా వేయాలని ఆర్అండ్బీ అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు.
ఈ పర్యటన వివరాలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. "సెలవు రోజున కొద్దిపాటి సమయం దొరకడంతో సొంత వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ఎంతో సంతృప్తి, ఆనందం కలిగించింది" అని ఆయన పేర్కొన్నారు.