తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

  • వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులు
  • నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీమ్ జిల్లాల్లో వర్షాలు
  • ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు, మక్కలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రైతులు పంట నష్టపోయారు. పంట నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందారు. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెంబి మండలాలు, కొమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్, కౌటాల మండలాల్లో అకాల వర్షాలతో ధాన్యం తడిసిముద్దయింది. ఇదిలా ఉండగా, పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.

Telangana Rains
Telangana Weather
Heavy Rainfall
Nalgonda
Bhadradri Kothagudem
Komaram Bheem Asifabad

More Telugu News