కుప్పంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు

  • కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు
  • ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం సందర్శన
  • గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం
  • సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
  • అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు, భువనేశ్వరి
 సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి తమ నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి.

ఈ రోజు ఉద‌యం కుప్పం చేరుకున్న చంద్రబాబు దంపతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు నేరుగా ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సమర్పించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వారి వెంట పలువురు స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.


Chandrababu
Kuppam
Nara Bhuvaneswari
Prasanna Tirupati Gangamma Temple
Andhra Pradesh CM
Temple Visit
Kuppam Constituency
Special Prayers

More Telugu News