హెచ్డీఎఫ్సీని వెనక్కి నెట్టిన ఎయిర్టెల్.. రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డు
- రూ.11.90 లక్షల కోట్లకు చేరిన ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్
- ఇంట్రాడేలో 2 శాతం లాభపడ్డ కంపెనీ షేరు విలువ
- వారం రోజుల్లో 10 శాతం వృద్ధి
- మార్కెట్ క్యాప్లో రిలయన్స్ టాప్
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను వెనక్కి నెట్టింది. దీంతో దేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. సోమవారం నాటి ట్రేడింగ్లో ఎయిర్టెల్ షేర్లు రెండు శాతానికి పైగా లాభపడటంతో ఈ ఘనత సాధ్యమైంది.
ఓ దశలో ఎయిర్టెల్ మార్కెట్ విలువ ఏకంగా రూ.11.90 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.11.86 లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో ఎయిర్టెల్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం దేశంలో రూ.18.09 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో కొనసాగుతోంది.
గత వారం రోజుల్లో ఎయిర్టెల్ షేర్లు 10 శాతం మేర లాభపడ్డాయి. కానీ ఇదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు కేవలం 1 శాతం మాత్రమే పెరిగాయి. గత ఆరు నెలల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 22 శాతం మేర పతనమవడం గమనార్హం. బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థిరమైన ప్రదర్శన కనబర్చింది. ఈ బ్యాంక్ నికర లాభం 10.9 శాతం పెరిగి రూ.1,912 కోట్లకు చేరింది. బ్యాంక్ నికర ఆదాయం కూడా 3.2 శాతం వృద్ధితో రూ.3,380 కోట్లుగా నమోదైంది. నిరర్థక ఆస్తులు 1.15 శాతంతో స్థిరంగా ఉన్నాయి.
మరోవైపు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికర లాభం ఈ త్రైమాసికంలో 34 శాతం తగ్గింది. ఈ క్వార్టర్లో ఎయిర్టెల్ రూ.7,325 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీకి రూ.11,021 కోట్ల లాభం వచ్చింది. గత ఏడాది లాభాల్లో రూ.2,892 కోట్ల పన్ను మినహాయింపు కలిసి రావడమే ఈ వ్యత్యాసానికి కారణమని ఎయిర్టెల్ పేర్కొంది.
ఓ దశలో ఎయిర్టెల్ మార్కెట్ విలువ ఏకంగా రూ.11.90 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.11.86 లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో ఎయిర్టెల్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం దేశంలో రూ.18.09 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో కొనసాగుతోంది.
గత వారం రోజుల్లో ఎయిర్టెల్ షేర్లు 10 శాతం మేర లాభపడ్డాయి. కానీ ఇదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు కేవలం 1 శాతం మాత్రమే పెరిగాయి. గత ఆరు నెలల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 22 శాతం మేర పతనమవడం గమనార్హం. బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థిరమైన ప్రదర్శన కనబర్చింది. ఈ బ్యాంక్ నికర లాభం 10.9 శాతం పెరిగి రూ.1,912 కోట్లకు చేరింది. బ్యాంక్ నికర ఆదాయం కూడా 3.2 శాతం వృద్ధితో రూ.3,380 కోట్లుగా నమోదైంది. నిరర్థక ఆస్తులు 1.15 శాతంతో స్థిరంగా ఉన్నాయి.
మరోవైపు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికర లాభం ఈ త్రైమాసికంలో 34 శాతం తగ్గింది. ఈ క్వార్టర్లో ఎయిర్టెల్ రూ.7,325 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీకి రూ.11,021 కోట్ల లాభం వచ్చింది. గత ఏడాది లాభాల్లో రూ.2,892 కోట్ల పన్ను మినహాయింపు కలిసి రావడమే ఈ వ్యత్యాసానికి కారణమని ఎయిర్టెల్ పేర్కొంది.