పెళ్లి విందులో విషాదం.. పుచ్చకాయ తిని బాలుడు మృతి?

  • ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఘటన
  • మరో నలుగురికి తీవ్ర అస్వస్థత
  • పుచ్చకాయ వల్లేనంటున్న బాధిత కుటుంబం
  • ఆహార నమూనాలను సేకరించిన ఆరోగ్య శాఖ అధికారులు
ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఒక వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి విందు తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఓ బాలుడు మరణించగా, మరో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గుర్కోడ్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పుచ్చకాయ తినడం వల్లే ఇలా జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బాధితులంతా తమ మేనమామ వివాహ వేడుక కోసం గుర్కోడ్ గ్రామానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందరూ కలిసి భోజనం చేశారు. తిన్న రెండు గంటలకే చిన్నారులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ అఖిలేశ్ ధివార్ అనే బాలుడు మృతి చెందాడు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు పెళ్లి జరిగిన ప్రదేశానికి వెళ్లి ఆహార నమూనాలను, ముఖ్యంగా పుచ్చకాయ ముక్కలను సేకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, మరిన్ని పరీక్షల కోసం నమూనాలను పంపినట్లు వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతా నలుగురు చిన్నారులు కోలుకుంటున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే బాలుడు మరణించాడని వారు ధ్రువీకరించారు. అయితే, అందుకు పుచ్చకాయే కచ్చితమైన కారణమా అనే విషయంపై దర్యాప్తు తర్వాతే స్పష్టత వస్తుందని వెల్లడించారు.

Akhilesh Dhivar
Chhattisgarh food poisoning
wedding food poisoning
watermelon poisoning
Janjgir Champa district
food poisoning death
Gurkhod village
child death
food sample testing

More Telugu News