మోదీ చేసిన 'ఎంఎంసీ' వ్యాఖ్యలపై వీహెచ్ ఫైర్

VH Fires on Modis MMC Comments
  • ముస్లిం లీగ్ - మావోయిస్టు కాంగ్రెస్ అని వ్యాఖ్యానించిన మోదీ
  • మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయన్న వీహెచ్
  • మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'ఎంఎంసీ' (ముస్లిం లీగ్ - మావోయిస్టు కాంగ్రెస్) వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. నిన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయగా... నేడు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు (వీహెచ్) ఘాటుగా స్పందించారు.


ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని మావోయిస్టులతో ముడిపెట్టడాన్ని వీహెచ్ తీవ్రంగా ఖండించారు. హింస కారణంగానే దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. అలాంటి చరిత్ర కలిగిన పార్టీని మావోయిస్టులతో పోల్చడం ఆ మహనీయుల త్యాగాలను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింల పాత్రను విస్మరించి, వారిని కించపరిచేలా మాట్లాడటం ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తికి తగదని హితవు పలికారు.


ప్రధాని వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వీహెచ్ తెలిపారు. మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని కూడా హెచ్చరించారు.

Go Back to Shorts
V. Hanumantha Rao
Narendra Modi
VH
Telangana Politics
MMC Remark
Congress Party
Maoists
Secunderabad Parade Grounds
Muslim League
Indira Gandhi
Rajiv Gandhi

More Telugu News