ఐస్ నిర్బంధం నుంచి భారత సంతతి మహిళ విడుదల.. ఎవరీ మీను బాత్రా?.. ఎందుకు అరెస్ట్ అయ్యారు?
- అమెరికాలో ఐస్ నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీను బాత్రా విడుదల
- దాదాపు ఏడు వారాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన టెక్సాస్ కోర్టు అధికారిణి
- అరెస్టులో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారంటూ ఫెడరల్ జడ్జి కీలక ఆదేశాలు
- అయినప్పటికీ అమెరికాలో శాశ్వత నివాసం కోసం కొనసాగుతున్న న్యాయపోరాటం
- సైన్యంలో ఉన్న కుమారుడి ద్వారా తల్లికి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు
అమెరికాలోని టెక్సాస్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ-ఐస్) అధికారులు అరెస్ట్ చేయగా, దాదాపు ఏడు వారాలుగా నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీను బాత్రాకు ఊరట లభించింది. ఆమె అరెస్టు ప్రక్రియలో ప్రాథమిక హక్కులు, చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని ఫెడరల్ జడ్జి నిర్ధారించడంతో ఆమెను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏప్రిల్ 30న ఆమె విడుదలయ్యారని, ఆమె తరపు న్యాయవాది దీపక్ అహ్లువాలియా సీబీఎస్ న్యూస్కు వెల్లడించారు.
"మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆరేడు వారాలు చాలా కష్టంగా గడిచాయి. ఈ క్షణం వస్తుందని మాకు తెలుసు. కానీ, ఇంత సమయం పడుతుందని ఊహించలేదు" అని అహ్లువాలియా తెలిపారు. మీను బాత్రాకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ఇంటర్వ్యూ నిర్వహించకుండా, చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా నిర్బంధంలోకి తీసుకున్నారని ఫెడరల్ జడ్జి తన తీర్పులో పేర్కొన్నారని ఆయన వివరించారు.
ఎవరీ మీను బాత్రా?.. ఎందుకు అరెస్ట్ అయ్యారు?
మీను బాత్రా రెండు దశాబ్దాలకు పైగా టెక్సాస్లో సర్టిఫైడ్ కోర్టు ఇంటర్ప్రెటర్గా పనిచేస్తున్నారు. హిందీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉండటంతో దేశవ్యాప్తంగా ఆమెకు మంచి పేరుంది. మార్చి 17న విస్కాన్సిన్లోని మిల్వాకీకి వృత్తిపరమైన పని మీద వెళ్లేందుకు హార్లింగెన్లోని వ్యాలీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఐస్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం రేమండ్విల్లేలోని ఎల్ వల్లే డిటెన్షన్ ఫెసిలిటీకి తరలించారు.
కొనసాగుతున్న న్యాయపోరాటం
మీను బాత్రా విడుదలైనప్పటికీ ఆమె అమెరికాలో ఉండేందుకు చట్టపరమైన పోరాటం ఇంకా ముగియలేదని ఆమె న్యాయవాది స్పష్టం చేశారు. "పోరాటం ఇంకా ముగియలేదు. మీను బయటకు వచ్చారు. కానీ, ఇప్పుడు ఆమెను ఇక్కడే ఉంచడం ముఖ్యం. ఆమెకు ఎలాంటి సంబంధం లేని మూడో దేశానికి పంపే ప్రయత్నాలను మేము చివరి వరకు ప్రతిఘటిస్తాం" అని అహ్లువాలియా పేర్కొన్నారు. ప్రస్తుత ఆదేశాల ప్రకారం సరైన చట్టపరమైన నోటీసు, న్యాయవాది సమక్షంలో ఇంటర్వ్యూ లేకుండా అధికారులు ఆమెను మళ్లీ అరెస్ట్ చేయలేరు.
సుదీర్ఘ వలస చరిత్ర
సుమారు 35 సంవత్సరాల క్రితం సిక్కు మత విశ్వాసాల కారణంగా తన తల్లిదండ్రులు హత్యకు గురవడంతో మీను బాత్రా భారత్ నుంచి పారిపోయి అమెరికాకు వచ్చారు. ఇక్కడ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో ఆమెకు "విత్హోల్డింగ్ ఆఫ్ రిమూవల్" హోదా లభించింది. దీని ప్రకారం ఒక వ్యక్తిని ఏ దేశంలోనైతే హింసకు గురయ్యే ప్రమాదం ఉందో ఆ దేశానికి తిరిగి పంపకుండా ఈ హోదా రక్షణ కల్పిస్తుంది. ఇది పూర్తిస్థాయి ఆశ్రయం కానప్పటికీ, దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు. "నేను ఇక్కడ చట్టబద్ధంగానే ఉన్నాను. నన్ను దేశం నుంచి పంపలేరు. నాకు చింత లేదు. ఇక్కడే ఉండి పనిచేయాలనుకుంటున్నాను" అని నిర్బంధంలో ఉన్నప్పుడు ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రస్తుతం మీను బాత్రా నలుగురు పిల్లలు (అమృత, లూకాస్, ఆర్యన్, జాస్పర్) అమెరికా పౌరులే. వారిలో చిన్న కుమారుడైన జాస్పర్ యూఎస్ సైన్యంలో పనిచేస్తున్నాడు. అతని ద్వారా తల్లికి శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కల్పించేందుకు ఆమె న్యాయవాదుల బృందం ప్రయత్నిస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరతామని, నాలుగు నుంచి ఆరు నెలల్లో గ్రీన్ కార్డ్ మంజూరయ్యే అవకాశం ఉందని అహ్లువాలియా ఆశాభావం వ్యక్తం చేశారు.
"మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆరేడు వారాలు చాలా కష్టంగా గడిచాయి. ఈ క్షణం వస్తుందని మాకు తెలుసు. కానీ, ఇంత సమయం పడుతుందని ఊహించలేదు" అని అహ్లువాలియా తెలిపారు. మీను బాత్రాకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ఇంటర్వ్యూ నిర్వహించకుండా, చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా నిర్బంధంలోకి తీసుకున్నారని ఫెడరల్ జడ్జి తన తీర్పులో పేర్కొన్నారని ఆయన వివరించారు.
ఎవరీ మీను బాత్రా?.. ఎందుకు అరెస్ట్ అయ్యారు?
మీను బాత్రా రెండు దశాబ్దాలకు పైగా టెక్సాస్లో సర్టిఫైడ్ కోర్టు ఇంటర్ప్రెటర్గా పనిచేస్తున్నారు. హిందీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉండటంతో దేశవ్యాప్తంగా ఆమెకు మంచి పేరుంది. మార్చి 17న విస్కాన్సిన్లోని మిల్వాకీకి వృత్తిపరమైన పని మీద వెళ్లేందుకు హార్లింగెన్లోని వ్యాలీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఐస్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం రేమండ్విల్లేలోని ఎల్ వల్లే డిటెన్షన్ ఫెసిలిటీకి తరలించారు.
కొనసాగుతున్న న్యాయపోరాటం
మీను బాత్రా విడుదలైనప్పటికీ ఆమె అమెరికాలో ఉండేందుకు చట్టపరమైన పోరాటం ఇంకా ముగియలేదని ఆమె న్యాయవాది స్పష్టం చేశారు. "పోరాటం ఇంకా ముగియలేదు. మీను బయటకు వచ్చారు. కానీ, ఇప్పుడు ఆమెను ఇక్కడే ఉంచడం ముఖ్యం. ఆమెకు ఎలాంటి సంబంధం లేని మూడో దేశానికి పంపే ప్రయత్నాలను మేము చివరి వరకు ప్రతిఘటిస్తాం" అని అహ్లువాలియా పేర్కొన్నారు. ప్రస్తుత ఆదేశాల ప్రకారం సరైన చట్టపరమైన నోటీసు, న్యాయవాది సమక్షంలో ఇంటర్వ్యూ లేకుండా అధికారులు ఆమెను మళ్లీ అరెస్ట్ చేయలేరు.
సుదీర్ఘ వలస చరిత్ర
సుమారు 35 సంవత్సరాల క్రితం సిక్కు మత విశ్వాసాల కారణంగా తన తల్లిదండ్రులు హత్యకు గురవడంతో మీను బాత్రా భారత్ నుంచి పారిపోయి అమెరికాకు వచ్చారు. ఇక్కడ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో ఆమెకు "విత్హోల్డింగ్ ఆఫ్ రిమూవల్" హోదా లభించింది. దీని ప్రకారం ఒక వ్యక్తిని ఏ దేశంలోనైతే హింసకు గురయ్యే ప్రమాదం ఉందో ఆ దేశానికి తిరిగి పంపకుండా ఈ హోదా రక్షణ కల్పిస్తుంది. ఇది పూర్తిస్థాయి ఆశ్రయం కానప్పటికీ, దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు. "నేను ఇక్కడ చట్టబద్ధంగానే ఉన్నాను. నన్ను దేశం నుంచి పంపలేరు. నాకు చింత లేదు. ఇక్కడే ఉండి పనిచేయాలనుకుంటున్నాను" అని నిర్బంధంలో ఉన్నప్పుడు ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రస్తుతం మీను బాత్రా నలుగురు పిల్లలు (అమృత, లూకాస్, ఆర్యన్, జాస్పర్) అమెరికా పౌరులే. వారిలో చిన్న కుమారుడైన జాస్పర్ యూఎస్ సైన్యంలో పనిచేస్తున్నాడు. అతని ద్వారా తల్లికి శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కల్పించేందుకు ఆమె న్యాయవాదుల బృందం ప్రయత్నిస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరతామని, నాలుగు నుంచి ఆరు నెలల్లో గ్రీన్ కార్డ్ మంజూరయ్యే అవకాశం ఉందని అహ్లువాలియా ఆశాభావం వ్యక్తం చేశారు.