ఉప్పల్ స్టేడియంలో భర్తతో కలిసి సందడి చేసిన పీవీ సింధు
- సన్రైజర్స్, కోల్కతా మ్యాచ్కు హాజరైన పీవీ సింధు
- భర్తతో కలిసి ఆరెంజ్ ఆర్మీకి మద్దతు
- ఇటీవలే ఊబర్ కప్ టోర్నీలో ఆడిన సింధు
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు ఐపీఎల్ మ్యాచ్లో సందడి చేశారు. ఆదివారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్), కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరిగిన మ్యాచ్కు ఆమె హాజరయ్యారు. తన భర్త వెంకట దత్తా సాయితో కలిసి వచ్చిన సింధు, హోమ్ టీమ్ అయిన సన్రైజర్స్కు మద్దతు తెలిపారు.
ఈ జంట ఆరెంజ్ రంగు దుస్తుల్లో మెరిశారు. సన్రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్తో కలిసి సింధు దంపతులు మ్యాచ్ను వీక్షించారు. సింధు స్టేడియంలో కనిపించడంతో అభిమానులు హోరెత్తించారు.
ఇటీవలే ముగిసిన ఊబర్ కప్ టోర్నీలో పాల్గొన్న తర్వాత సింధు ఈ మ్యాచ్కు హాజరవడం గమనార్హం. ఈ టోర్నీలో చైనాతో జరిగిన గ్రూప్ ఏ చివరి మ్యాచ్లో భారత్ 0-5 తేడాతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్లో సింధు ప్రపంచ నంబర్ 2 వాంగ్ జీ యితో తలపడింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో సింధు ఒక దశలో 18-12 ఆధిక్యంలో నిలిచినా, ఆ తర్వాత అనూహ్యంగా ఓటమి పాలైంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, సన్రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, బ్యాటర్లు రాణించకపోవడంతో 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ జంట ఆరెంజ్ రంగు దుస్తుల్లో మెరిశారు. సన్రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్తో కలిసి సింధు దంపతులు మ్యాచ్ను వీక్షించారు. సింధు స్టేడియంలో కనిపించడంతో అభిమానులు హోరెత్తించారు.
ఇటీవలే ముగిసిన ఊబర్ కప్ టోర్నీలో పాల్గొన్న తర్వాత సింధు ఈ మ్యాచ్కు హాజరవడం గమనార్హం. ఈ టోర్నీలో చైనాతో జరిగిన గ్రూప్ ఏ చివరి మ్యాచ్లో భారత్ 0-5 తేడాతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్లో సింధు ప్రపంచ నంబర్ 2 వాంగ్ జీ యితో తలపడింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో సింధు ఒక దశలో 18-12 ఆధిక్యంలో నిలిచినా, ఆ తర్వాత అనూహ్యంగా ఓటమి పాలైంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, సన్రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, బ్యాటర్లు రాణించకపోవడంతో 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది.