అమరావతి చంద్రబాబుకు బంగారు బాతు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
- వైసీపీని గొడ్డలి పార్టీ అనడంపై చంద్రబాబుపై కాకాణి ఫైర్
- చంద్రబాబు ఒక గడ్డపారలా ప్రజాధనాన్ని తవ్వుతున్నారని విమర్శ
- అమరావతి నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ
- చదరపు అడుగుకు రూ. 20,489 చెల్లించడంపై అభ్యంతరం
- ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేసిన కాకాణి
వైసీపీని 'గొడ్డలి పార్టీ' అని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. చంద్రబాబే ఒక గడ్డపారలా మారి ప్రభుత్వ ఖజానాను, ప్రజా సంక్షేమాన్ని తవ్వి తీస్తున్నారని వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఆదివారం నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు, టీడీపీ నేతలు వైసీపీని హత్యారాజకీయాలు చేసే గొడ్డలి పార్టీగా అభివర్ణిస్తున్నారని, కానీ వాస్తవానికి చంద్రబాబే ఒక గడ్డపారకు చిహ్నమని కాకాణి విమర్శించారు. అమరావతి ప్రాజెక్టు చంద్రబాబుకు, ఆయన బృందానికి ఒక బంగారు బాతుగా మారిందని ఆరోపించారు. ఒకవైపు పెంచిన కాంట్రాక్టుల ద్వారా ప్రజాధనాన్ని దోచుకుంటూ, మరోవైపు విద్య, వైద్యం, రైతులు, మహిళలు, యువతను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 20,489 చెల్లిస్తున్నారని, సాధారణంగా దీనికి రూ. 4,500 మాత్రమే ఖర్చవుతుందని కాకాణి అన్నారు. తెలంగాణ సచివాలయం, పార్లమెంట్ భవనం నిర్మాణ ఖర్చులు కూడా ఇంతకంటే చాలా తక్కువని గుర్తుచేశారు. గతంలో తనకు అనుకూలంగా ఉన్నవారికే మళ్లీ కాంట్రాక్టులు కట్టబెట్టి, రేట్లు పెంచి వ్యవస్థీకృతంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎన్టీఆర్ నుంచి పార్టీని, పదవిని లాక్కోవడంతో మొదలైన చంద్రబాబు తీరు మారలేదని, అవినీతి, కుట్రలు ఆయన నైజమని విమర్శించారు. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ విజయాన్ని అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకాణి ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు, టీడీపీ నేతలు వైసీపీని హత్యారాజకీయాలు చేసే గొడ్డలి పార్టీగా అభివర్ణిస్తున్నారని, కానీ వాస్తవానికి చంద్రబాబే ఒక గడ్డపారకు చిహ్నమని కాకాణి విమర్శించారు. అమరావతి ప్రాజెక్టు చంద్రబాబుకు, ఆయన బృందానికి ఒక బంగారు బాతుగా మారిందని ఆరోపించారు. ఒకవైపు పెంచిన కాంట్రాక్టుల ద్వారా ప్రజాధనాన్ని దోచుకుంటూ, మరోవైపు విద్య, వైద్యం, రైతులు, మహిళలు, యువతను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 20,489 చెల్లిస్తున్నారని, సాధారణంగా దీనికి రూ. 4,500 మాత్రమే ఖర్చవుతుందని కాకాణి అన్నారు. తెలంగాణ సచివాలయం, పార్లమెంట్ భవనం నిర్మాణ ఖర్చులు కూడా ఇంతకంటే చాలా తక్కువని గుర్తుచేశారు. గతంలో తనకు అనుకూలంగా ఉన్నవారికే మళ్లీ కాంట్రాక్టులు కట్టబెట్టి, రేట్లు పెంచి వ్యవస్థీకృతంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎన్టీఆర్ నుంచి పార్టీని, పదవిని లాక్కోవడంతో మొదలైన చంద్రబాబు తీరు మారలేదని, అవినీతి, కుట్రలు ఆయన నైజమని విమర్శించారు. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ విజయాన్ని అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకాణి ధీమా వ్యక్తం చేశారు.