ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎన్నారై టెక్కీ జయరామ్ మృతి

  • అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జయరాం (27) మృతి
  • డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా
  • బంధువుల వివాహానికి హాజరై తిరిగి అమెరికా వెళ్తుండగా ఘటన
  • ఆగివున్న టిప్పర్ లారీని వేగంగా ఢీకొట్టిన కారు
ఏలూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ప్రవాసాంధ్రుడు దుర్మరణం పాలయ్యాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జయరాం (27) ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. ముదినేపల్లి మండలం చినపాలపర్రు వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ముదినేపల్లి మండలం వనుదుర్రు గ్రామానికి చెందిన జయరాం, బంధువుల వివాహ వేడుక కోసం ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. పెళ్లి వేడుకలు ముగియడంతో తిరిగి అమెరికా వెళ్లేందుకు శనివారం తెల్లవారుజామున కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరాడు. కారు చినపాలపర్రు వద్దకు రాగానే, డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో అదుపుతప్పిన కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, జయరాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు నడుపుతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి వచ్చి తిరిగి వెళుతున్న యువకుడు ఇలా విగతజీవిగా మారడంతో వనుదుర్రు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Jayaram
Eluru road accident
NRI techie death
Andhra Pradesh accident
Software engineer dies
Chinapalaparru accident
Vanudurru village
Mudinapalli mandal
Road accident India
Hyderabad airport

More Telugu News