మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం... నవజాతశిశువును పీక్కుతిన్న వీధికుక్కలు
- జిల్లాలోని జడ్చర్ల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో విషాదకర సంఘటన
- గుట్ట పక్కన నవజాతశిశువును పడేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
- శిశువును కుక్కలు కొరికి తినడం చూసి పోలీసులకు స్థానికుల సమాచారం
శిశువు శరీర భాగాలను గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏం జరిగింది, నవజాత శిశువును గుట్ట పక్కన పడేసింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.