కడప జిల్లాలో దారుణం.. తల్లిని వేధిస్తున్న తండ్రిని కడతేర్చిన మైనర్

son murdered father in kadapa district
  • కడప జిల్లా చాపాడు మండలం ఓబుల్‌రెడ్డి పేటలో ఘటన 
  • మద్యం మత్తు, కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ
  • బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కన్నతల్లిని వేధిస్తున్నాడన్న ఆగ్రహంతో ఓ 16 ఏళ్ల బాలుడు కన్నతండ్రినే కత్తితో పొడిచి హత్య చేశాడు. కడప జిల్లా చాపాడు మండలం ఓబుల్‌రెడ్డి పేటలో గత రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కొంతకాలంగా మద్యానికి బానిసై, నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. నిన్న రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యను వేధించడమే కాకుండా, ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కళ్లముందే తండ్రి తన తల్లిని కొడుతుండటంతో తట్టుకోలేకపోయిన మైనర్ కుమారుడు తీవ్ర ఆవేశానికి గురయ్యాడు.

ఇంట్లో ఉన్న కత్తితో తండ్రిపై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న చాపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మద్యపానం, కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Kadapa
Murder
crime news

More Telugu News