డ్రెస్సింగ్ రూమ్లో దమ్ము కొడుతూ దొరికిపోయిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్!
- ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో రియాన్ పరాగ్ వేపింగ్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. చర్యలకు డిమాండ్
- నిబంధనల ప్రకారం పరాగ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం
- ఈ సీజన్లో కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమవుతున్న పరాగ్
- ఇటీవలే రాజస్థాన్ టీమ్ మేనేజర్కు జరిమానా విధించిన బీసీసీఐ
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో అతడు వేపింగ్ (ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగుతున్నట్టు) చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై క్రీడాభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం న్యూ చండీగఢ్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛేజింగ్లో కీలక దశలో 16 బంతుల్లో 29 పరుగులు చేసి పరాగ్ ఔటైన కొద్దిసేపటికే బ్రాడ్కాస్ట్ కెమెరాలో అతడు వేపింగ్ చేస్తున్నట్లు కనిపించే దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో, అతడిపై చర్యలు తీసుకోవాలని పలువురు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
స్టేడియంలలో ఆటగాళ్ల ప్రవర్తనపై బీసీసీఐకి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. డ్రెస్సింగ్ రూమ్ లేదా డగౌట్లో పొగాకు, సంబంధిత ఉత్పత్తుల వాడకంపై నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో, నిబంధనల ప్రకారం పరాగ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సీజన్లో రాజస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన 24 ఏళ్ల పరాగ్, ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఈ మ్యాచ్కు ముందు ఆడిన ఏడు ఇన్నింగ్స్లలో కేవలం 81 పరుగులే చేసి బ్యాటర్గా విఫలమయ్యాడు. కాగా, ఈ వివాదం ఎలా ఉన్నా, ఈ మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇటీవలే డగౌట్లో మొబైల్ ఫోన్ వాడినందుకు రాజస్థాన్ టీమ్ మేనేజర్కు బీసీసీఐ జరిమానా విధించిన విషయం తెలిసిందే.
మంగళవారం న్యూ చండీగఢ్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛేజింగ్లో కీలక దశలో 16 బంతుల్లో 29 పరుగులు చేసి పరాగ్ ఔటైన కొద్దిసేపటికే బ్రాడ్కాస్ట్ కెమెరాలో అతడు వేపింగ్ చేస్తున్నట్లు కనిపించే దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో, అతడిపై చర్యలు తీసుకోవాలని పలువురు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
స్టేడియంలలో ఆటగాళ్ల ప్రవర్తనపై బీసీసీఐకి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. డ్రెస్సింగ్ రూమ్ లేదా డగౌట్లో పొగాకు, సంబంధిత ఉత్పత్తుల వాడకంపై నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో, నిబంధనల ప్రకారం పరాగ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సీజన్లో రాజస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన 24 ఏళ్ల పరాగ్, ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఈ మ్యాచ్కు ముందు ఆడిన ఏడు ఇన్నింగ్స్లలో కేవలం 81 పరుగులే చేసి బ్యాటర్గా విఫలమయ్యాడు. కాగా, ఈ వివాదం ఎలా ఉన్నా, ఈ మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇటీవలే డగౌట్లో మొబైల్ ఫోన్ వాడినందుకు రాజస్థాన్ టీమ్ మేనేజర్కు బీసీసీఐ జరిమానా విధించిన విషయం తెలిసిందే.