ప్రియాన్ష్ ఆర్యకు ప్రీతి జింటా పంచ్.. వీడియో ఇదిగో!
- పంజాబ్ విజయం తర్వాత ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యకు ప్రీతి జింటా పంచ్
- ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును ఛేదించి పంజాబ్ కింగ్స్ రికార్డ్
- ఢిల్లీ క్యాపిటల్స్పై 6 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ చారిత్రక విజయం సాధించిన తర్వాత ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గెలుపు తర్వాత మైదానంలోకి వచ్చిన ఆమె యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యను అభినందిస్తూ సరదాగా ఓ పంచ్ ఇచ్చారు. ఆ సమయంలో ప్రియాన్ష్ ఫన్నీగా స్పందించగా ఈ ఘటనను చూసిన కామెంటేటర్ రవిశాస్త్రి "ఓహ్, అది మంచి పంచ్" అని వ్యాఖ్యానించాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ కావడం విశేషం. ప్రభ్సిమ్రన్ సింగ్ (26 బంతుల్లో 76), ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 43) అద్భుత ఆరంభం ఇవ్వగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 71 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ భారీ ఛేదనలో ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్ కేవలం 6.5 ఓవర్లలోనే 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి పటిష్టమైన పునాది వేశారు.
అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ కేవలం 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. అతనికి తోడుగా నితీశ్ రాణా (44 బంతుల్లో 91) రాణించాడు. రాహుల్ అద్భుత ఇన్నింగ్స్తో ఢిల్లీ గెలుపు ఖాయమనిపించినా, పంజాబ్ బ్యాటర్ల ఎదురుదాడితో మ్యాచ్ ఫలితం తారుమారైంది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తమ అజేయ యాత్రను కొనసాగిస్తోంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ కావడం విశేషం. ప్రభ్సిమ్రన్ సింగ్ (26 బంతుల్లో 76), ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 43) అద్భుత ఆరంభం ఇవ్వగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 71 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ భారీ ఛేదనలో ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్ కేవలం 6.5 ఓవర్లలోనే 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి పటిష్టమైన పునాది వేశారు.
అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ కేవలం 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. అతనికి తోడుగా నితీశ్ రాణా (44 బంతుల్లో 91) రాణించాడు. రాహుల్ అద్భుత ఇన్నింగ్స్తో ఢిల్లీ గెలుపు ఖాయమనిపించినా, పంజాబ్ బ్యాటర్ల ఎదురుదాడితో మ్యాచ్ ఫలితం తారుమారైంది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తమ అజేయ యాత్రను కొనసాగిస్తోంది.